Poet • Storyteller • Cultural Ambassador
నానమ్మ తాతగారు కీ.శే శ్రీ దుద్యాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి సుందరమ్మ గారు మరియు అమ్మమ తాతగారు శ్రీ జనమంచి రామసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి రాధమ్మ గారి పాద పద్మములను స్మరించుకుంటూ నమః స్సుమాంజలులు.
నేను హైదరాబాదు లో జన్మించి మా నాన్న గారి స్వస్థల మైన మదనపల్లె పట్టణమందు విద్యాబుద్ధులు నేర్చకున్నాను. ఆ తరువాత ఉన్నత విద్యలను హైదరాబాదు లో అభ్యసించి NTR యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో పట్టభద్రురాలి నయ్యాను. మానవ సేవే మాధవ సేవ యని తలచి వైద్య వృత్తి నెంచుకున్నాను.
మొదటినుంచి నాకు పెయింటింగ్ పెన్సిల్ స్కెచెస్ వేయడం చాల ఇష్టం అలాగే కథలు కవితలు వ్రాయడం కూడా చాలా ఇష్టమైనవె, ఈ మద్యనే పద్య రచన మిద సాదన చేసి అమ్మవారి కృపతో ఈ శతకాన్ని పూర్తి చేశాను.
నాకు హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీనివాస శ్రీధర్ తో వివాహం జరిగినది, మా వారు సాఫ్టు వేరు రంగములో పని చేస్తున్నారు మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి కార్తిక్ రామ్, అమ్మాయి దుర్గ శర్వాణి.
నాకు ఇద్దరు తోబుట్టువులు అక్కయ్య హిమబిందు మరియు అన్నయ్య మంజునాథ్. ఇంటి లో అందరికన్నా చిన్నదాన్ని కావటం వలన నాకు వారి ప్రేమ సహాయ సహకారములను నిత్యం అందిస్తూ నా వెన్నంటే ఉంటారు.
నా పద్య రచనకు తమ వంతు సహాయ సహకారముల నందిస్తూ నిరంతరం నన్ను ప్రోత్స హించిన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నాను.
-హరిణి శ్రీధర్
First Telugu Shatakam Writer in Haryana
Awarded by
Shri. Relangi Narsimha Rao Indian film director and screenwriter
Award on Women's day
Recognizing efforts towards telugu
literature
%DESC%
%DATE% %MSG%


హరిణి... మన హరిణి... చొప్పకట్ల (దుద్యాల) హరిణి శతకం రాసిందట. ఆశ్చర్యపోయాను. నా చేత్తో పట్టుకుని చూసి ఒకసారి గిల్లుకొని చూస్తే చురుక్కుమన్నప్పుడు నిజమే ...More
శతక రచయిత్రి చి:సౌ: హరిణి మాకు దగ్గరి బంధువు. మా సోదరుని మనుమని భార్య మాకు మనుమరాలు. వృత్తిరీత్యా వైద్యురాలైనా ప్రవృత్తిరీత్యా కవనముపట్ల నాకర్షితురాలు ...More
ఇద్దరు బిడ్డలకు తల్లిగా, ఒక బాధ్యతగల సాఫ్ట్ వేర్ ఉన్నతోద్యోగియైన శ్రీ శ్రీనివాస శ్రీధర్ గారికి ఉత్తమ ఇల్లాలై, తాను స్వయంగా ఫిజియోథెరపిస్ట్ వృత్తిలో ఉన ...More
సనాతన కాలం నుండి పద్యం రాజిల్లుతూనే ఉంది. పద్యమనేది పద్య కవులకు ఒక ధృవపత్రం లాంటిది అని చెప్పవచ్చు. సాధారణంగా పద్యకవులు పుస్తకం అచ్చువేయించాలంటే 108 ప ...More
మన భారతదేశము అనగా ఈ కర్మభూమి సర్వమంత్ర స్వరూపమై, సర్వవిద్యా సంపత్ప్రదాయకమై ఉండటం, ఇటువంటి మట్టిలో మనం జన్మించటం మన పూర్వజన్మ సృకృతం. అందుకు గానూ మనకు ...More
శ్రీ గణనాథునికి అంకితము చేయబడినవి రెండు పురాణములు ఒకటి 'గణేశ పురాణం', రెండు 'ముద్గల పురాణం'. కవయిత్రి ముద్గల పురాణమాధారముగా ఈ శతకములో చాలా పద్యములు రచ ...More
నా మొదటి ప్రేక్షకులు, నా అత్యంత నిజాయితీగల విమర్శకులు మరియు నా గొప్ప మద్దతుదారులు.